CTR: ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి శనివారం దర్శించుకున్నారు. పలువురు వైసీపీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.