HYD: ఓవైపు కేసులు నమోదు చేస్తున్న ప్రభుత్వ స్థలాల కబ్జాలు ఆగడం లేదు. తాజాగా బంజారాహిల్స్లోని రోడ్ నంబర్-10లో జలమండలికి చెందిన స్థలాన్ని కొందరు కబ్జాకు యత్నించారు. ప్రహరీ గోడను గుర్తుతెలియని వ్యక్తులు కూల్చేశారు. విషయాన్ని తెలుసుకున్న బంజారాహిల్స్ వార్డు జలమండలి మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కబ్జాకు సంబంధించి రెండు FIRలు నమోదు అయ్యాయి.