విజయనగరం: శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు జీవితం నేటి యువతకు ఆదర్శమని, బహుభాషలలో ప్రావీణ్యం సంపాదించిన యువతకు అవకాశాలు మెండుగా ఉంటాయని జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ తెలిపారు. ఆయన జయంతిని పురస్కరించుకొని శనివారం కలక్టరేట్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి జేసీ పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలుగు సాహితీ రంగానికి చేసిన కృషి అమోఘమమన్నారు.