ATP: తాడిపత్రి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ రాసే విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ శివరామకృష్ణ తెలిపారు. ఏప్రిల్ 4 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని, హాజరయ్యే వారికి స్టడీ మెటీరియల్ ఉచితంగా అందజేస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్ 25న పాలిసెట్ పరీక్ష ఉంటుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.