అల్లూరి: జీకేవీధి మండలం పెదవలస పంచాయతీ చాపరాతిపాలెం గ్రామంలో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. చాపరాతిపాలెం గ్రామానికి చెందిన నిత్యశ్రీ (13) పెదవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిత్యశ్రీ ఉరివేసుకుంది. బాలిక మృతదేహాన్ని చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.