ATP: శ్రీ రామనవమి పర్వదినం వేళ తాడిపత్రిలోని శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి క్షేత్రం భక్తులతో పోటెత్తింది. వనవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పెన్నానది తీరాన వెలసిన ఈ ఆలయంలో ఏటా రామనవమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.