VSP: స్త్రీ శక్తి పథకం వల్ల ఆక్యుపెన్సీ 69% నుంచి 86%కు పెరిగిందని ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి. అప్పలనాయుడు తెలిపారు. విశాఖ రూరల్ డిపోను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. దివ్యాంగులకు కేటాయించిన సీట్లు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. బస్సులు అన్ని స్టేజీల్లో ఆగేలా చూడాలని, దూర ప్రయాణ బస్సులు సమయానికి నడపాలని ఆదేశించారు.