SRD: పటాన్చెరు మండలం చిట్కుల్ జీటీఎన్ కాలనీలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. స్థానిక కాంగ్రెస్ నేత నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం, ఆలయ ప్రతిష్ట, మహా కుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో కళ్యాణాన్ని ఘనంగా జరిపారు. భక్తుల కోలాటాలు, సంగీత విభావరి కార్యక్రమాలతో సందడి నెలకొంది.