KRNL: కోడుమూరు మండలం కల్లపారి దుర్గమ్మ గుడిలో హుండీ ఆదాయాన్ని శుక్రవారం పోలీసుల సమక్షంలో లెక్కించారు. ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు ఒక హుండీ పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లిన నేపథ్యంలో, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నారు. లెక్కింపులో రూ. 8,27,309 పాటు బంగారం, వెండి కానుకలు వచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు. భక్తుల కానుకలను పకడ్బందీగా భద్రపరిచారు.