CTR: గుడిపల్లి మండలం సాల చింతనపల్లి గ్రామ సమీపంలో అడవి పందుల కోసం పెట్టిన నాటు బాంబు పేలి ఓ కుక్క మృతిచెందగా మరో కుక్కపిల్ల తీవ్రంగా గాయపడింది. కొంతమంది వేటగాళ్లు అడవి పందుల కోసం పెడుతున్న నాటు బాంబులు మూగజీవుల ప్రాణాలు తీస్తున్నాయ. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నారులు ఎవరైనా వీటిని తాకి ఉంటే పరిస్థితి ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు.