AP: అన్నమయ్య జిల్లా ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఏప్రిల్ 1న కోదండరాముడి కల్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి తర్వాత 5 రోజులకు చైత్ర శుద్ధ చతుర్ధశి రోజున అధికార లాంఛనాలతో పౌర్ణమికి ఒక రోజు ముందు కల్యాణం జరుగుతుంది. దీనిని ‘ఏకశిలా నగర’ కల్యాణం అని కూడా పిలుస్తారు.