E.G: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు రాజమండ్రి, గోకవరం డిపోలలో నిర్బంధిత 38 వాహనాలకు ఈనెల 30న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జిల్లా రవాణాశాఖాధికారి ఆర్.సురేష్ ఇవాళ తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సీజర్ యార్డ్లో వేలం పాట జరుగుతుందన్నారు. వేలంలో పాల్గొనేవారు ముందస్తుగా వాహనాలను పరిశీలించుకోవచ్చన్నారు.