BHPL: అంబట్పల్లి గ్రామానికి చెందిన పుట్ట మధునక్క అనే మహిళ అనారోగ్యానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స నిమిత్తం డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని స్థానిక నేతలు, IT మంత్రి శ్రీధర్ బాబుకు తెలియజేశారు. వెంటనే స్పందించిన మంత్రి CMRF నుంచి రూ.2.50 లక్షల LOC మంజూరు చేయించారు. ఇవాళ మంత్రి PRO బాధిత కుటుంబానికి LOCని అందజేశారు.