శక్యా లోభయితుం నాహమైశ్వర్యేణ ధనేన వా! అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభా యథా॥ అనే ఈ శ్లోకాన్ని రావణాసురుడితో సీతమ్మ పలికిందట. ‘ఎట్టి ధనాశలకు గానీ, ఐశ్వర్యాది ప్రలోభాలకు గానీ నేను లొంగేదానిని కాను. సూర్యుడి నుంచి కాంతి వేరుకానట్టుగా శ్రీరాముడి నుంచి నేను వేరుగాను’ అని చెబుతుంది సీతమ్మ. ‘నీకు తెలియక సీతారాములు ఇద్దరు అని భ్రమిస్తున్నావు. మేమిద్దరం ఒకటే’ అని అంటుందట.