శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ సీతారామచంద్ర స్వామిని ఆరాధించడం వల్ల జీవితంలో శాంతి, సంతోషం, శ్రేయస్సు, అదృష్టం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. భక్తితో చేసే పూజలు మన జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించడంలో సహాయపడతాయి. ‘ఓం శ్రీ రామాయ నమః’, ‘శ్రీ రామ జయ రామ జయ జయ రామ’ వంటి మంత్రాలను జపించడం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. కనీసం 108 సార్లు జపించడం ఉత్తమం.