RR: తెలంగాణ తిరుపతిగా పేరు గాంచిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నేడు సెల్వార్ కూత్తుతో అంకురార్పణ జరుగనుంది. వచ్చేనెల 3 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. మొదట పుట్టమన్ను తెచ్చి హోమగుండాలను ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు. ఏప్రిల్ 3న చక్రతీర్థం, ధ్వజావరోహణం కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.