TPT: సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్ కనకమేడల రవీంద్ర కుమార్, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చారు. వేర్వేరుగా శుక్రవారం వేకువజామున శ్రీవారిని అభిషేక సేవలో దర్శించుకున్నారు. అనంతరం వీరికి ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనంతో తీర్థప్రసాదాలను అందజేశారు.