BDK: సేవ్ సింగరేణి జాత కార్యక్రమంలో భాగంగా మణుగూరు పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మికులు, సంఘ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ హక్కుల కోసం నినాదాలు చేశారు. సింగరేణి సంస్థను రక్షించాలని, కార్మికుల హక్కులను కాపాడాలని, ప్రైవేటీకరణ చర్యలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.