హైదరాబాద్లోని పెట్రోల్ బంకుల వద్ద గత రెండు రోజులుగా ఉన్న రద్దీ తగ్గి, క్యూ లైన్లు సాధారణ స్థితికి చేరుకున్నాయి. రాష్ట్రంలో సుమారు 3 నెలలకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంధన కొరతపై వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.