మంత్రి నారా లోకేష్ను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు కలిశారు. అనంతపురం జిల్లాలో విశేష సేవలు అందిస్తున్న ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ అనుమతులు పునరుద్ధరించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడి రెన్యూవల్ అయ్యేలా కృషి చేసినందుకు మంత్రికు కృతజ్ఞతలు తెలిపారు.