KDP: క్రికెట్ బెట్టింగ్, మట్కా, జూద కార్యకలాపాలపై ప్రొద్దుటూరు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఐపీఎల్ నేపథ్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, నేర చరిత్ర ఉన్న వారిపై పర్యవేక్షణ పెంచారు. పాల్గొన్న వారిపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని ఏఎస్పీ విబు కృష్ణా హెచ్చరించారు. యువత బెట్టింగ్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.