BHNG: శ్రీరామనవమి వేడుకల కోసం పట్టణంలోని చౌరస్తా రామాలయంలో జరుగుతున్న ఏర్పాట్లను మున్సిపల్ ఛైర్ పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి పరిశీలించారు. పారిశుద్ధ్యం, భక్తుల కోసం టెంట్లు, తాగునీటి సౌకర్యాలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కౌన్సిలర్లు విఘ్నేష్, తాహెరా బబ్లు అధికారులకు సూచించారు.