WGL: పర్వతగిరి మండల కేంద్రంలో దోపిడీ కేసులో ఐదుగురు నిందితులకు వరంగల్ కోర్టు శిక్ష విధించినట్లు ఎస్సై ప్రవీణ్ గురువారం తెలిపారు. మట్ట మల్లేశం ఫిర్యాదు మేరకు క్రైమ్ నం.56/2019, ఎస్సీ నం.267/2019లో కేసు నమోదు, విచారణ జరిపిన కోర్టు ఐపీసీ 395 సెక్షన్ కింద A1 నుంచి A5 వరకు నిందితులకు 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.2,000 జరిమానా విధించారు.