కడప జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ.. కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సందేశం విడుదల చేశారు. రాష్ట్రంలో సంక్షేమం, సుపరిపాలనతో ప్రతి ఇంటా సంతోషం నెలకొంటోందని తెలిపారు. సీతారాముల ఆదర్శ జీవితం ప్రతి కుటుంబానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.