WGL: వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ గురువారం సంగెం పోలీస్ స్టేషన్ను సందర్శించి, సిబ్బంది పనితీరును సమీక్షించారు. స్టేషన్ పరిధిలోని నేరాలు, రౌడీ షీటర్లు, పెండింగ్ కేసుల వివరాలను తెలుసుకుని, పెండింగ్ కేసులపై విచారణ జరిపి, ప్రతి బాధితుడికి న్యాయం జరిగేలా పనిచేయాలని సూచించారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని పోలీసులను ఆదేశించారు.