GDWL: ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించకపోతే కూలీలు మళ్లీ వలస బాట పట్టాల్సి వస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి అన్నారు. బుధవారం ధరూర్ మండల కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి, ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. గత 8 వారాలుగా కూలీ డబ్బులు అందుక ఇబ్బందులు పడుతున్నారన్నారు.