BHPL: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న MRI యంత్రం, డయాలసిస్ కేంద్రం ఏర్పాటు పనులను గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎమ్మారై ఏర్పాటు పనులను నిరంతరం పర్యవేక్షించడానికి ఆర్డీవోను ప్రత్యేక అధికారిగా నియమించినట్లు తెలిపారు. ఈ నెలాఖరు వరకు ఎమ్మారై యంత్రం ఏర్పాటు పూర్తి చేయాలని ఆదేశించారు.