GNTR: ఫిరంగిపురంలో మండలంలోని రేపూడి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో భద్రపరచిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాల గోదాంను త్రైమాసిక తనిఖీల్లో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్, తమీమ్ అన్సారియా పరిశీలించారు. గోదాంలో అమలు చేస్తున్న భద్రతా ప్రమాణాలు, సీసీ కెమెరాలు, అగ్నిమాపక సదుపాయాలు తదితర అంశాలను సమగ్రంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.