JN: వల్మిడి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ఉత్సవ కమిటీని దేవాదాయ శాఖ ఇవాళ నియమించింది. ఐదుగురు సభ్యులతో ఈ కమిటీని నియమిస్తూ ఆలయ ఈఓ సాల్వాది మోహన్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా నియమితులైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు.