KMM: వ్యవసాయాన్ని కాపాడండి దేశాన్ని రక్షించండి అనే నినాదంతో వ్యవసాయక విప్లవానికి ప్రజలు సిద్ధం కావాలని AIKMS జాతీయ అధ్యక్షుడు వెంకట్రామయ్య పిలుపునిచ్చారు. గురువారం ఖమ్మంలో అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) జాతీయ కమిటీ సమావేశం నిర్వహించారు. జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకువస్తున్న వీబీ రామ్ జీ చట్టాన్ని వ్యతిరేకిస్తునట్లు పేర్కొన్నారు.