సత్యసాయి: పెనుకొండ పట్టణం గోనిపెంట రోడ్డులో ఉన్న హజరత్ మొహమ్మద్ కమ్రుద్దీన్ బాబా దర్గా శుక్రవారం ఘనంగా గంధం మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని పెనుకొండలో హిందూపురం ఎంపీ పార్థసారథిని మైనారిటీ సోదరులు కలసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దర్గా ఉత్సవానికి హాజరై ఆశీర్వాదాలు తీసుకోవాలని ఎంపీని కోరారు.