MDCL: మేడ్చల్ పరిసర ప్రాంతాలలో వేసవి వేళ ఓవైపు భూగర్భ జలాలు తగ్గుముఖం పడుతుంటే, కొంతమంది ఎలాంటి పర్మిషన్లు లేకుండా బోర్లు వేస్తూ భూగర్భ జలాలను తోడేస్తున్నారని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని భూగర్భ జల శాఖ అధికారులు తగిన విధంగా పరిశీలించి, చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.