HYD: భాగ్యనగరంలో భానుడు బగ్గుమనడంతో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అయితే, ఈ సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. సాధ్యమైనంత వరకు ఎండలో బయటకి వెళ్లకండి. ఒకవేళ వెళ్లినా వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, మజ్జిగ లాంటివి తాగడం ఎంతో మంచిది. ఎప్పుడు చెప్పేవే అని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి.