NGKL: కుమ్మెర మల్లన్న జాతరలో అగ్రకుల వారు జరిపిన దాడిలో మరణించిన చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని డీఎస్పీ కార్యాలయం ఎదుట ఆదివారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. నిందితులను అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి, నష్టపరిహారం ఇవ్వాలన్నారు. బాధితులపై FIR నమోదు చేయడం దుర్మార్గమని ఆగ్రహించారు.