సిద్దిపేట జిల్లాలో ఇంధన కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని సీపీ రోహిణి ప్రియదర్శిని స్పష్టం చేశారు. అన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని తెలిపారు. వదంతులు నమ్మి వాహనదారులు ఆందోళన చెందవద్దని, ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని సూచించారు. తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.