ASR: విద్యార్థి దశ నుండే హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కొయ్యూరు సీఐ బీ.శ్రీనివాసరావు సూచించారు. బుధవారం సాయంత్రం ఆయన ఎస్సై కిషోర్ వర్మతో కలిసి రాజేంద్రపాలెం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో సమావేశం నిర్వహించి, పలు అంశాలపై అవగాహన కల్పించారు. చిన్నప్పటి నుంచి ఉన్నత లక్ష్యంతో చదివితే మంచి భవిష్యత్తు పొందవచ్చన్నారు.