KDP: ఒంటిమట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు ఇవాళ నుంచి ప్రారంభం కానున్నాయి. గురువారం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాతం, తదనంతరం మూలవిరాట్లకు అలంకరణ, ఆరాధన, అర్చన, కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 27న ఉదయం 9.30 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 4 గంటలకు పోతన జయంతి, కవి సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తారు.