AP: మార్కాపురం జిల్లాలో బస్సు ప్రమాదంపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ప్రయాణికులు సజీవ దహనం కావడం తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు అన్నివిధాల అండగా ఉంటాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు. అలాగే, ఈ ఘటనపై మంత్రి మండిపల్లి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.