ఉమ్మడి E.G జిల్లాలోని 1,069 గ్రామపంచాయతీల సర్పంచుల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. గడువు ముందు ప్రభుత్వం సర్పంచుల ఆర్థిక అధికారాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ అధికారాలను డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్లకు అప్పగించనుంది. కాకినాడ (385), తూర్పుగోదావరి (342), కోనసీమ(342) జిల్లాల్లో త్వరలో ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు పంచాయతీ వర్గాలు తెలిపాయి.