RR: నల్లగండ్ల హుడా కాలనీలో రూ. 2 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను MLA అరికెపూడి గాంధీ, మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. అత్యాధునిక వీధి దీపాల వల్ల కాలనీకి కొత్త శోభ రావడమే కాకుండా, రాత్రి వేళల్లో వాహనదారులు, పాదచారుల ప్రయాణం సురక్షితంగా మారుతుందని తెలిపారు.