MLG: రైతులు వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్ సూచించారు. ములుగు మున్సిపాలిటీ పరిధి జీవంతరావుపల్లికు చెందిన ఇద్దరు రైతులకు వ్యవసాయ శాఖ 50% రాయితీపై గడ్డి చుట్టే యంత్రాలు అందజేసింది. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సురేశ్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవ్ సింగ్ పాల్గొన్నారు.