VKB: ఈనెల 30న తై బజార్, షట్టర్లు, వాటర్ ఫిల్టర్ల బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు సర్పంచ్ డి.వై. నరసింహులు, కార్యదర్శి లాలప్ప బుధవారం తెలిపారు. పంచాయతీ ఆదాయ వనరుల పెంపులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు పంచాయతీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.