VZM: రైతులు లాభదాయకమైన పంటలు వేసుకోవాలని గజపతినగరం మండల వ్యవసాయ అధికారి కిషోర్ కుమార్ కోరారు. బుధవారం గజపతినగరం మండలంలోని తుమ్మికాపల్లి గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం జరిగింది. రైతులు పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేసుకోవాలని సూచించారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న పథకాలు గురించి సమగ్రంగా వివరించారు.