VZM: రాజాం మండలం పొగిరిలో డయేరియా కేసులు లేవని కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామంలో జరిగిన ఒక వేడుకలో కలుషిత ఆహారం తీసుకోవడంతో కొంతమంది అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు. ఈ నెల 21 నుంచి 25 వరకు ఐదుగురు ఆసుపత్రిలో చేరగా, ఇద్దరిని డిశ్చార్జ్ చేసి, మిగిలిన ముగ్గురి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.