JGL: జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత అధ్యక్షతన విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఎస్సీ/ ఎస్టీ అట్రాసిటీ కేసులను జాప్యం లేకుండా పరిష్కరించి బాధితులకు న్యాయం అందించాలని ఆదేశించారు. జిల్లాలో 575 బాధిత కుటుంబాలకు రూ.4.52 కోట్ల సాయం మంజూరు చేసినట్లు తెలిపారు. పెండింగ్లో ఉన్న 192 కుటుంబాలకు వెంటనే నిధులు విడుదల చేసి అందిస్తామన్నారు.