SKLM: పోలాకి మండలంలోని పలు గ్రామాలలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ కూటమి ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తుందని ఎమ్మెల్యే రమణ మూర్తి అన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే పంచాయతీలకు చెత్త సేకరణ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. గ్రామాల్లో పారిశుధ్య మెరుగుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.