VSP: ఎర్త్ అవర్ 2026 సందర్భంగా మార్చి 28 శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 వరకు అవసరం లేని విద్యుత్ దీపాలను ఆఫ్ చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ నగర ప్రజలను కోరారు. World Wide Fund for Nature ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 190కి పైగా దేశాల్లో నిర్వహించబడుతోందన్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా పర్యావరణ పరిరక్షణకు సహకరించాలన్నారు.