కర్నూలు: సెట్కూరు యువజన సర్వీసుల శాఖ, ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో ఇవాళ ఏపీఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో మాదకద్రవ్యాల సరఫరా నిఘా, డ్రగ్స్ అంశాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. డ్రైవర్లు సిగరెట్లు, మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపారు. సిగరెట్లతో ప్రారంభమై మత్తు పదార్థాల వైపు దారి తీస్తుందని హెచ్చరించారు.