విజయనగరంలో డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున, ఎమ్మెల్యే అదితి గజపతి రాజు ఇవాళ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్-నిప్పాన్ స్టీల్ సంయుక్త ప్రాజెక్ట్కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసిన సందర్భంగా వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ స్టీల్ ప్లాంట్ వలన అనేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు.