BPT: బాపట్ల మండలం బేతపూడిలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామ స్వామి వారి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. కార్యక్రమానికి బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్మాణంలో గ్రామ ప్రజల భాగస్వామ్యం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.